తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 150 సీట్ల భర్తీ కోసం సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఈ నెల 28 నుంచి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం .ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్-30, కంప్యూటర్-30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-30, మెకానికల్-30, మైనింగ్ -30 సీట్లు ఉన్నాయని https: # scp. scpolytechnic. com/ online& admission 3 ద్వారా దరఖాస్తు చేసి, కాపీని డౌన్లోడ్ చేసి, సంబంధిత గని, డిపార్ట్మెంట్ హెచ్ఐడీతో అటెస్టేషన్ చేయించి జూలై 5వ తేదీన జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొంది. ລ້ ລ້ 9010222161, 8790112515, 9491144168 సంప్రదించాలని సూచించింది
Admin
తెలుగు వెలుగు టీవీ