Tuesday, 28 July 2026 03:22:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో ఆకస్మికంగా పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

Date : 17 October 2025 07:36 PM Views : 527

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం అవగాహనా కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పాన్ షాపుల్లో పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.నిషేదిత గంజాయితో పాటు ఇతర మత్తు పదార్ధాలను నిర్మూలనే లక్ష్యంగా నిత్యం ఇలాంటి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మరియు భద్రాచలం సబ్ డివిజన్ల వారీగా డిఎస్పీల ఆధ్వర్యంలో పోలీస్ జాగిలాల సహాయంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో ఇప్పటికే గుర్తించిన గంజాయి హాట్ స్పాట్ నందు కూడా ఇట్టి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.ఎవరైనా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్దాలను విక్రయించడం గానీ,రవాణా చేయడం గానీ,సేవించడం గానీ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా వీటితో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గానీ,డయల్ 100 కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. మన జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు ప్రజలు కూడా సమాచారం అందించి సహకారం అందజేయాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :