తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వచ్చిన పాములను సమాచారం మేరకు ప్రాణదార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ వెళ్లి పట్టుకొని, ప్రజలకు పాము నుండి సమస్య పరిష్కరించి వారికి అవగాహన కల్పించి బుధవారం ఆయా పాములను సుదూర అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో జనావాసాల మధ్య పాముల సంచారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అవగాహన కలిగి ఉండటం అవసరమని ఈ సందర్భంగా సంతోష్ వివరించారు
Admin
తెలుగు వెలుగు టీవీ