Tuesday, 28 July 2026 09:58:14 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఫుట్ పాత్ ల ఆక్రమణలు తొలగించాలి - మున్సిపల్ కమిషనర్‌కు జేబీపీ నేత కామేష్ ఫిర్యాదు

Date : 01 July 2026 03:00 PM Views : 156

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫుట్‌పాత్ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ మున్సిపల్ కమిషనర్‌కు జేబీపీ నేత కామేష్ ఫిర్యాదు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయని,ఏంజీ రోడ్డులో ప్రభుత్వ ఫుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ బుధవారం మున్సిపల్ కమిషనర్ సుజాతకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.ఆయన మాట్లాడుతూ ఏంజీ రోడ్డులోని ఇంటి నెంబర్లు 6-2-141,6-2-142కు చెందిన షాప్ యజమాని ఇటీవల చేపడుతున్న నిర్మాణాల్లో అవసరమైన అనుమతులు లేకుండానే ప్రభుత్వ ఫుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి సెట్ బ్యాక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా భవనం పక్కన ఉన్న స్థలంలో కూడా అక్రమంగా మెట్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.ప్రధాన రహదారిపై ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.సాధారణ ప్రజలు చిన్నపాటి నిర్మాణాలు చేపట్టినా నోటీసులు జారీ చేసే అధికారులు,కొంతమంది విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.ఫుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.వెంటనే స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పట్టణ అధ్యక్షుడు గజ్జల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :