తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : లక్ష్మీదేవిపల్లి ప్రాంతంలో ఉన్న వివేకవర్ధిని హైస్కూల్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న పి. ముకేష్ అనే విద్యార్థిని పై క్లాస్లో జరిగిన చిన్నపాటి అల్లరి సందర్భంలో అతడితో సంబంధం లేకపోయినా స్కూల్ సెక్రటరీ సుబ్బారావు పెద్ద కర్రతో తొమ్మిది సార్లు కొట్టారు. ఈ దాడి కారణంగా ముకేష్ చేయి ప్యాక్చర్ అయ్యింది. విధ్యార్థి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు చెప్పిన ప్రకారం చేయి విరగడం వల్ల తీవ్రమైన నొప్పికి గురవుతున్నాడు. మూడు రోజులుగా కుటుంబసభ్యులు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు విద్యార్థి తండ్రి స్కూలుకు వెళ్లి సంఘటనపై వివరణ కోరగా, సెక్రటరీ సుబ్బారావు స్కూల్లో లేకుండా బయటికి వెళ్లిపోయారు. విద్యార్థి తండ్రి భూపాల్ మాట్లాడుతూ – "ఇలాంటి చర్యలు మా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి. గతంలో కూడా ఒక దళిత విద్యార్థిని పై కాలుతో తన్నిన ఘటన ఈ స్కూల్లోనే జరిగింది. ఇది మేము ఖండిస్తున్నాము," అని అన్నారు. ఈ సంఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై శిక్షలుంటాయని పౌరసంఘాలు, బాలల హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించాలని, విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ