తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో జేబీపీ వినూత్న రాజకీయ శక్తిగా ఎదగనుందని అందుకు అనుగుణంగా హైకోర్టు న్యాయవాది సీనియర్ నాయకులు యెర్రా కామేష్ ను విస్తృతంగా వినియోగించుకుంటామని జేబిపి జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు బుధవారం విజయవాడలోని జాతీయ పార్టీ కార్యాలయంలో బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ తన అనుచరులతో కలిసి జైభీమ్ రావు భారత్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సంధర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకులు కామేష్ ను అన్ని పార్టీలు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
.తెలంగాణ రాష్ట్రంలోనే ఒక నూతన రాజకీయ శకానికి నాంది పలకనుందని అందుకు తొలి అడుగుగా సీనియర్ నాయకులు కామేష్ చేరిక జరిగిందని తెలిపారు.పార్టీని ముందుండి నడిపించే క్రమంలో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలను కామేష్ కు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. కామేష్ తోపాటు గంధం మల్లికార్జున రావు,నాగుల రవికుమార్,వినయ్,సోను, కొండా రాజేష్,మద్దిరాళ్ళ కిషోర్,బన్ను,నీలం సుబ్బారావు తదితరులు పార్టీలో చేరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ