Wednesday, 29 July 2026 05:46:43 AM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్.

Date : 27 July 2026 04:53 PM Views : 28

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి.యువతరానికి పదవి ఇచ్చి రేవంత్ చిత్తశుద్ది నిరూపించుకోవాలి.జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. జెన్ జీ నీ ముందుగా విద్యాశాఖ మంత్రిని చేసి,తర్వాత ఎమ్మెల్సీ గా చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కొవ్వత్తుల ర్యాలీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2029 లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత జెన్ జీ ని కేంద్ర విద్యాశాఖ మంత్రిని చేసేలా ఇక్కడ ఉన్న మంత్రి వర్గం అంత సిఫారసు చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదని 2023 నుండి తను చూస్తున్న విద్యాశాఖలో గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది బిడ్డల ప్రాణాలు పోతున్నాయని,రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల,ఆశ్రమ పాఠశాలల్లో నీటి వసతి కరువైందని అని పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని,విద్యాశాఖ సరిగా లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా ఒక "జెన్ జీ" కి ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖ మంత్రిని చేసి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాలు చేశారు.రాహుల్ ప్రధాని అంటూ మోచేతికి బెల్లం పెట్టే ముచ్చట్లు ఎందుకని,ఇప్పటికిప్పుడు అవకాశం ఉండగా రాహుల్ గాంధీకి ముడి పెట్టడం ఎందుకని ప్రశ్నించారు...తల్లిదండ్రులు పిల్లలను కనీ,పెంచి చదివించే స్థోమత లేక,రోజుల తరబడి పిల్లల్ని చూడకుండా ఉంటూ హాస్టల్స్ లో ఉంచి పిల్లల్ని చదివిస్తుంటే పాలకుల అసమర్ధత వల్ల పిల్లలు చనిపోయి ఇంటికి శవాలుగా వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి వెంటనే విద్యాశాఖను యువకులకు అప్పగించి విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వినయ్,చెనిగరపు నిరంజన్ కుమార్,వంశీ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :