Tuesday, 28 July 2026 12:44:16 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి ... AITUC ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన.

Date : 04 June 2025 11:35 AM Views : 531

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కు తక్షణమే నిర్ణయం తీసుకొని వేతనాలను పెంచాలని,కనీస వేతనాల సలహా మండలి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని,నిర్లక్ష్యం విడనాడాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్-AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కృష్ణఫర్ లు డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొత్తగూడెం కార్పోరేట్ లోని ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించి అమలు చేయడంలో, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచడంలో, కనీస వేతనాలు సలహా మండలి నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వా ఆమోదానికి సిఫారసు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు పొందిన సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. సింగరేణి యాజమాన్యం,రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను వాడుకోవడానికి, లాభాలను సాధించడానికి మాత్రమే కాకుండా సంస్థ లాభాలలో, సర్వీస్ లో అత్యంత కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్లక్ష్యం విడనాడాలని,తక్షణమే వేతనాలను పెంచి అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణిలో 18 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు, నర్సరీ కార్మికుల కనీస వేతనాలు అమలు, ప్రైవేటు కన్వేయన్స్ డ్రైవర్ల 15% ఆడహక్కు పేమెంటు కటింగు సమస్య,అందరికీ సీఎం పిఎఫ్ అమలు చేయడం, సీఎం పిఎఫ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వివరాలు కార్మికులకు అందజేయడం తదితర సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణమూర్తి,చుక్కయ్య, రాజేష్,ఆదిలక్ష్మి, మణెమ్మ,రాజేశ్వరి,లక్ పతి,రాజు,సుశీల, వెంకటేశ్వర్లు,రాము,విష్ణు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :