తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : రాబోయే రెండు రోజుల్లో ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు, ప్రజలు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితీష్ వి. పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక మండలాల పరిధిలోని లోతట్టు గ్రామాలకు చెందిన ప్రజలు నిరంతరం గోదావరి ఉధృతిని గమనించాలని సూచించారు. అధికారులు ఈ గ్రామాల విషయంలో వెంటనే స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన జాగ్రత్త చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు. ముంపు ప్రాంత గ్రామాల విషయంలో తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలను వెంటనే చేపట్టాలన్నారు. అవసరమైన రెస్క్ టీములు, మర బోట్లు సమకూర్చుకోవాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. అత్యవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అటు పునరావాస కేంద్రాల్లోనూ ప్రజలకు అవసరమైన నిత్య అవసరాలను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు....
Admin
తెలుగు వెలుగు టీవీ