Tuesday, 28 July 2026 07:32:50 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్

Date : 24 April 2026 03:55 PM Views : 180

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రేవంత్ రెడ్డి ఏడవ హామీ ఏమైంది ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తున్న ప్రభుత్వం : జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక సామాన్య నిరసన నుంచి భావోద్వేగ స్థాయికి చేరి,ప్రాణనష్టం దాకా వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందని,ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా పరిగణించాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని దాదాపు 41 రోజుల క్రితం కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడ వల్లే శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ఒడిగట్టాడని,రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు కాకుండా ఏడవ హామీ ప్రజాస్వామ్యం అని ఎవరైనా నిరాసన తెలిపే స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించి అందుకు విరుద్ధంగా నేడు సమ్మెను అణచివేసే కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు.ఆర్టీసీ కార్మికులు చేపట్టే ప్రతీ నిరసన కార్యక్రమం వెనక జై భీమ్ రావ్ భారత్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు చట్టబద్ధమైన పోరాట పందాలు కొనసాగిద్దామని ఎవరూ క్షణికావేశానికి గురై ఆత్మహత్యయత్నాలకు పాల్పడ వద్దని విజ్ఞప్తి చేశారు.మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐదు కోట్ల ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆకుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇంకా మొండి ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించకుండా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,జిల్లా కార్యదర్శి చెనిగరపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,శంకర్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :