తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ జిఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా. బుధవారం సాయంత్రం జిఎం కార్యాలయం ముందు నిరసన తెలిపి ఎస్ ఓ టు జిఎం కోటిరెడ్డి కి మెమొరాండం అందజేశారు.కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒక దిక్కున కార్మిక హక్కుల కోసం పోరాటాలు చేసే ట్రేడ్ యూనియన్ లని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుంది అని కేంద్ర ఈ పై మండిపడ్డారు. సింగరేణి సంస్థను మెల్లగా కేంద్ర ప్రభుత్వం ప్రవతేకరణకు వైపు తీసుకెళ్తుంది అని అన్నారు. కార్మికులు ను 12గంటల పనిని చేయిస్తూ శ్రమ దోపిడి చేస్తున్న బడా పెట్టుబడిదారులను పెంచి పోషిస్తుంది అని మోదీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయి లో విమర్శించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ కార్మిక 29 చట్టాలను నాలుగు కోడులుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తున్నాయని మండిపడ్డారు. ఈ కోడ్ ల విధానాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక సంఘాలు ఉండకూడదని కుట్రతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చిందని, కార్పొరేట్ శక్తులకు లాభం చేసే ఈ నాలుగు కోడ్ల అమలు వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు.నాలుగు కోడ్లను వెంటనే రద్దు చేయకపోతే నిర్వదిక సమ్మెకు సైతం వెనుకాడబోమని యాజమాన్యాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు యాజమాన్యాన్ని హెంచరించారూ ఈ కార్యక్రమం లో ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జునరావు, ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ రజాక్, టి బి జి కే ఎస్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, సి ఐ టి యు సెక్రటరీ విజయగిరి శ్రీనివాస్,జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వీరస్వామి,సందబోయిన శ్రీనివాస్, ఏం ఆర్ కే ప్రసాద్,సాయి పవన్,సాంబమూర్తి,కమల్,మధు కృష్ణ,గుమ్మడి వీరయ్య, బుటీక రాజేశ్వర్రావు, విజయగిరి శ్రీనివాస్,చిలుక రాజయ్య, గోపు కుమార్ స్వామి, ఎండి సత్తార్ పాష, సిహెచ్ సాగర్,మోహన్ రెడ్డి,నటరాజ్,మల్లికార్జున్ రావు,సకినాల సమ్మయ్య, పోశం శ్రీనివాస్,కొమరయ్య, కాసార్ల సమ్మయ్య,సాంబమూర్తి, బాలు,కొప్పుల కుమార్, సలిగంటి తిరుపతి, సత్యనారాయణ,గడప రాజయ్య వెంకటేశ్వర్లు,తాతిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ