తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రూ.3 కోట్ల విలువ చేసే 1186 కిలోల గంజాయిని సోమవారం దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు కేసుల్లో పట్టుబ డిన గంజాయిని AWs కన్సటింగ్ లిమిటెడ్ గోపాల్ పేట్ తల్లెడ మండలంలోని దహన కేంద్రంలో గంజాయిని దగ్ధం చేయించారు. ఖమ్మం డిప్యూటి కమిషనర్ జనార్థన్రెడ్డి, అసిస్టేంట్ కమిషనర్ గణేష్, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్ సూపరిండెంట్ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ రహీమ్ ఉన్నీషా బేగం సమక్షంలో గంజాయిని ద`గ్ధం చేయించారు. గంజాయిని దగ్ధం చేయించిన ఖమ్మం జి ల్లా ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్రెడ్డి అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ