తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐటిడిఏ పీఓ బి రాహుల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగాసీతారాములు ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఫెడరేషన్ కప్ రెజ్లింగ్ పోటీలలో, ఢిల్లీలో జరిగిన కేలో ఇండియా ట్రైబల్ సెకండ్ ఫేస్ రెజ్లింగ్ పోటీలలో ఏ.వెంకటప్రసాద్ 97 కేజీల విభాగములో కె. నవీన్ 100 కేజీల విభాగం లో పాల్గొని అంతర్జాతీయ క్రీడాకారులతో పోటీపడి సత్తా చాటి బెస్ట్ ర్యాంకులో నిలిచి ఖేలో ఇండియా జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. జాతియ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశి హుస్సేన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ బి రాహుల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నాగాసీతారాములును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన పిఓ రాహుల్, నాగా సీతారాములు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలలో సైతం పతకాలు గెలుపొంది అంతర్జాతీయ పోటీలలో సైతం ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని చాటాలని యువతి యువకులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని ప్రతిభవంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తామని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ పసుపులేటి వీరబాబు, జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధి ఇ.మొగిలి, సుదర్శన్ క్రీడాకారులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ