Tuesday, 28 July 2026 02:39:20 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

శనివారం గోదావరి నది హారతి. జిల్లా కలెక్టర్ జితిష్ వి. పాటిల్.

Date : 02 January 2026 08:48 PM Views : 528

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలంలో రేపు, అనగా తేది 03-01-2026 (పూర్ణిమ, శనివారం) నాడు సాయంత్రం 5:30 గంటల నుండి భద్రాచల క్షేత్రంలో గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించబడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, తెలిపారు.మన దేశంలో నదులు ప్రజల జీవనానికి ఆధారంగా నిలిచి, నాగరికత అభివృద్ధికి మూలాధారంగా పనిచేశాయి. తరతరాలుగా నదులు ప్రజల జీవన విధానం, సంస్కృతి మరియు పర్యావరణంతో ముడిపడి ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటువంటి నదుల్లో దక్షిణ భారతదేశంలో ప్రవహించే ప్రధాన నది గోదావరి.చరిత్రాత్మకంగా మరియు సాంస్కృతికంగా విశిష్టత కలిగిన గోదావరి నది తీరప్రాంతాలు అనేక సంప్రదాయాలు, కథనాలకు కేంద్రంగా నిలిచాయి. భద్రాచలం ప్రాంతం కూడా గోదావరి నదితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉండి, కాలక్రమేణా ఒక ప్రముఖ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన “ఏరు – ది రివర్ ఫెస్టివల్” లో భాగంగా గత శనివారం నుండి గోదావరి నదికి నది హారతి కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నది హారతి కార్యక్రమాన్ని ఇకనుండి ప్రతి వారం భద్రాచలంలో నిర్వహించనున్నట్లు పౌరుల అభిప్రాయం మేరకు 03.01.2026 రోజున మరియు వచ్చే ప్రతి శనివారం నిర్వహించాలని పేర్కొన్నారు.భద్రాచలం ప్రాంతంలో ప్రవహించే గోదావరి నది ఔన్నత్యాన్ని ప్రజలకు మరింతగా తెలియజేయడంతో పాటు, నది ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించడం మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రజలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని, గోదావరి నది సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :