తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తాం. త్వరితగతిన యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకువస్తాం.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈరోజు భూమి పూజ చేసుకున్న దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్డింగులు, సకల సౌకర్యాలు పూర్తి చేస్తాం అందుబాటులోకి తీసుకువస్తాం అని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈరోజు కొత్తగూడెంలో భూమి పూజ చేసుకున్న హెల్త్ సైన్స్ యూనివర్సిటీ కార్యక్రమం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఓ పెద్ద కార్యక్రమం అని అన్నారు. పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదని అన్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ద్వారా భూమి, భూమి లోపల ఉన్న పొరలు, భూమి లోపల ఉన్న ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాల పైన పరిశోధనలు చేయడమే కాకుండా తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే అద్భుత కార్యక్రమానికి, అత్యున్నత యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు భూమి పూజ చేసి పనులు మొదలుపెట్టామని తెలిపారు. యూనివర్సిటీ దేశానికి తలమానికం, అత్యున్నత యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ