Tuesday, 28 July 2026 07:00:17 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.

Date : 01 July 2026 06:46 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.రవాణా సౌకర్యాన్ని వెంటనే పునరుద్దరించాలి.తాత్కాలిక మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.రవాణాసౌకర్యం మెరుగుపర్చేందుకు ప్రేత్యేక ద్రుష్టి సారించాం.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. హైవేల నిర్వహణలో నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రామవరం గోధుమవాగు బ్రిడ్జీపై తీవ్రంగా ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల తాత్కాలిక మరమ్మత్తు పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిడ్జీపై ప్రమాదకరంగా మారిన గుంతల పట్ల నేషనల్ హైవే అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సిన నేషనల్ హైవే అథారిటీ పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లే, నిత్యం ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులను, ప్రాణాపాయ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ గుంతల పూడ్చే పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన ఈ తాత్కాలిక మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిలిచిపోయిన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే పునరుద్దరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి, తమ పరిధిలోని రోడ్డుపై ఉన్న గుంతలను శాశ్వత ప్రాతిపదికన పూడ్చి వాహనదారుల ఇబ్బందులను, సమస్యలను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఇప్పటికె వివిధ పథకాలలో మంజూరైన నిధులతో రోడ్లు, వంతెనలు, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత, కార్పొరేటర్లు కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, నగేష్, మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ తదితరులు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :