Tuesday, 28 July 2026 11:38:11 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

Date : 28 September 2025 06:23 PM Views : 281

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా శరన్నవరాత్రి సందర్బంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు కు ఆలయ మర్యాదలతో పెద్దమ్మతల్లి గుడి అధికారులు స్వాగతం పలికారు. పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు, డైరెక్టర్లు చీకటి. కార్తీక్,శనిగారపు.శ్రీనివాసరావు,చెవుగాని.పాపారావు,భుక్యా.గిరిప్రసాద్ లతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న నాగా సీతారాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరున్న కనకదుర్గమ్మ అమ్మవారిని దసరా శరన్నవరాత్రి సందర్బంగా దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నాగా సీతారాములు అన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని, తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో భక్తులు తరలివస్తున్నారని అన్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి కోరుకున్నారు. దసరా సందర్బంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పాలకమండలి, ఆలయ సిబ్బంది, అధికార యంత్రాంగంపై ప్రసంశలు కురిపించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు మంచి ఏర్పాట్లు చేశారని, సామాన్య భక్తులు కూడా అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఆయన వెంట ఓబీసీ జిల్లా సెక్రటరీ బొబ్బాల వెంకట్ యాదవ్, కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ జయప్రకాశ్, రవికాంత్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు అశోక్, వెంకటేశ్వర్లు,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :