Tuesday, 28 July 2026 07:55:16 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.

Date : 18 April 2026 08:29 PM Views : 159

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,హేమచంద్రపురం నందు శనివారం Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది.ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు,కోర్టు డ్యూటీ ఆఫీసర్లు,కోర్టు లైజన్ ఆఫీసర్లు మరియు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో గడిచిన ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో కోర్టుల్లో విచారణకు వచ్చిన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించబడింది. ముఖ్యంగా కన్విక్షన్,అక్విటల్ (Acquittal) కేసుల పురోగతిని విశ్లేషిస్తూ,కేసుల దర్యాప్తులో ఉన్న లోపాలు,సవాళ్లు మరియు మెరుగుదలకు అవసరమైన అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేసుల వేగవంతమైన విచారణకు ప్రాధాన్యత ఇవ్వాలని,చార్జ్ షీట్లు సమయానికి దాఖలు చేయాలని,సాక్షుల సమన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఏఎస్పీ ఆదేశించారు. కోర్టు విచారణల్లో ఆలస్యం జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.అదేవిధంగా దర్యాప్తు ప్రక్రియలో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, సైంటిఫిక్ మరియు డిజిటల్ ఆధారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కేసుల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కన్విక్షన్ రేటును పెంచాలని దిశానిర్దేశం చేశారు.భాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు పోలీస్ మరియు ప్రాసిక్యూషన్ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా దర్యాప్తు అధికారులకు కేసుల నిర్వహణ, సాక్ష్యాల సమర్పణ మరియు కోర్టు విచారణలో పాటించాల్సిన ముఖ్య అంశాలపై విలువైన సూచనలు చేశారు.మొత్తం మీద, ఈ సమావేశం ద్వారా కేసుల దర్యాప్తు మరియు న్యాయపరమైన ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు పొందారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :