తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 6 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఇంజనీర్ మహేందర్ పాల్గొని రైతులకు మరియు గ్రామంలోని విద్యుత్ వినియోగదారులకు పలు రకాల సూచనలు సలహాలు ఇచ్చారు. మహేందర్ రైతులతో మాట్లాడుతూ విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు వాడటం వలన మోటర్లు,ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవని అందరూ తప్పనిసరిగా కెపాసిటర్లు వాడాలని తద్వారా నాణ్యమైన విద్యుత్ పొందగలుగుతారని, స్టార్టర్ బాక్సుల దగ్గర ఎర్త్ వైర్లు కంపల్సరిగా వాడాలని ఫీజుల సమస్యలు ఏవైనా ఉంటే మీకు మీకుగా కాకుండా లైన్మెన్ మరియు ఎలక్ట్రిషన్ లతో ఫీజులు వేయించాలని కోరారు మంచి విద్యుత్ కొరకు నాణ్యమైన కేబుల్స్ ని కొనగలరని నాసిరకం వైర్లు వాడవద్దని చెప్పారు. గృహములల్లో కూడా నాణ్యమైన వైర్లు వాడుతూ ఎం సి బి లు అమర్చుకోవాలని ఎర్త్ వాడటం వలన ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చని, గ్రామంలో ఇల్లు మీద నుంచి కరెంటు వైర్లు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడి రవికుమార్, లైన్మెన్ భాస్కర్ మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ