తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ... అప్యాయతలు, అనురాగాలు మర్చిపోతున్న ఈ రోజుల్లో స్నేహానికి విలువ నిచ్చి 50 ఏళ్లకు తిరిగి పూర్వ విద్యార్థులు కలుసుకున్న మహోన్నత ఘటన శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల లో చోటు చేసుకుంది. సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 1974- 1975 సంవత్సరానికి చెందిన పదో తర గతి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి స్మృతులు నెమరేసుకున్నారు. ఒకరినొకరు పలుకరించుకుంటూ ఉద్వేగానికి లోనైనారు. పాఠశాల ఆవరణలో తిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులు, తమతో చదివిన మరణించిన వారిని గుర్తు చేసుకుని, వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు,పూర్వ విద్యార్థులు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వ విద్యార్థి మాజీ సింగరేణి పర్సనల్ జిఎం పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ మొత్తం 41 మందిని విద్యార్థులు ఉండగా ఇందులో తొమ్మిది మంది చనిపోయారని ఆరుగురు విదేశాల్లో ఉన్నారని కొందరు అనువార కారణాల యొక్క రాలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ పాఠశాల బ్రదర్ రాజశేఖర్ రెడ్డి, జార్జి రెడ్డి పూర్వ విద్యార్థులు సింగరేణి పర్సనల్ రిటైర్డ్ జిఎం పసుపులేటి శ్రీనివాస్ , వసుంధర అధినేత శంకర్ బాబు, ప్రేమ్. రవిశంకర్ రత్న కుమార్ , శ్రీధర్ తదితరులు పాల్గొనారు
Admin
తెలుగు వెలుగు టీవీ