Tuesday, 28 July 2026 08:08:26 PM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన సభ్యులకు రివార్డులను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 16 May 2026 04:10 PM Views : 307

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ క్యాడర్లకు చెందిన 10 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రివార్డులను శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన చేతుల మీదుగా అందజేశారు.మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వారి క్యాడర్ ను బట్టి తెలంగాణ ప్రభుత్వం రివార్డులను ప్రకటించింది.10 మంది సభ్యులకు గాను 55,60,000/-(యాభై ఐదు లక్షలు) రూపాయలను ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు.ప్రత్యేక చొరవ తీసుకొని లొంగిపోయిన వారందరికి ప్రభుత్వం తరఫున రావాల్సిన రివార్డు నగదును ఎస్పీ రోహిత్ రాజు అందజేశారు. రివార్డులను అందుకున్న వారిలో స్టేట్ కమిటీ మెంబెర్ - 01,డివిజనల్ కమిటీ మెంబర్స్ - 01, ఏరియా కమిటీ మెంబెర్స్ - 06, దళ సభ్యులు - 02 లు ఉన్నారు. ప్రస్తుతం వారి స్థితిగతుల గురించి ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.రివార్డులను అందుకున్న సభ్యులకు ఎస్పీ కొన్ని సూచనలను చేశారు.రివార్డుల ద్వారా అందుకున్న నగదును విలాసాలకు ఉపయోగించకుండా,సక్రమ పద్దతిలో జీవనోపాదికి ఉపయోగపడేలా వాటిని ఖర్చు చేసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసులు చేపట్టిన "ఆపరేషన్ చేయూత" కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపోయిన మావోయిస్టులకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేసారు.లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందిస్తున్నామని తెలియజేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :