తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : [4:57 pm, 8/2/2026] SIR: కొత్తగూడెం ప్రాంతంలోని ప్రైవేట్ వైద్య సంస్థలపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) తనిఖీలు నిర్వహించారు. గాయత్రి నర్సింగ్ హోమ్, యామిని హాస్పిటల్, సిను ENT హాస్పిటల్ తో పాటు చి. రమేష్ (PMP), నియోమీ (PMP) క్లినిక్లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రులకు క్రింది సూచనలు ఇవ్వబడినవి:•ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలి.•సేవల ధరల జాబితాను ప్రజలకు కనిపించేలా ఉంచాలి. •ITDA ప్రాజెక్ట్ అధికారి సూచించిన రేట్ల ప్రకారం మాత్రమే చార్జీలు వసూలు చేయాలి.•విధులు నిర్వహిస్తున్న వైద్యుల పేర్ల జాబితాను ప్రదర్శించాలి. •బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను సక్రమంగా నిర్వహించాలి.•అవసరమైన అన్ని పత్రాలను రిసెప్షన్ వద్ద అందుబాటులో ఉంచాలి.PMP ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ల తనిఖీలో: •అధిక శక్తి యాంటీబయాటిక్స్ నిల్వలో ఉన్నట్లు గుర్తించారు.•ల్యాబ్ పరీక్షల కోసం రిఫరల్ స్లిప్లు జారీ చేస్తున్నట్లు గమనించారు. •రోగులకు ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు.పై కారణాల వల్ల రెండు PMPలకు నోటీసులు జారీ చేయబడినవి. 6 రోజుల్లోగా వివరణ సమర్పించాలని ఆదేశించబడింది. లేకపోతే తగిన చర్యలు తీసుకోబడతాయి.ఈకార్యక్రమంలో డాక్టర్ భద్రు MPHEO మరియు మోహన్ DPMO పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ