Tuesday, 28 July 2026 09:52:10 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 11 November 2025 08:32 PM Views : 342

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునీకరణ చర్యలు అత్యవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన ఆధునీకరణ చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య పరికరాల అవసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆపరేషన్ థియేటర్ విభాగాన్ని పరిశీలించి, ఆధునీకరణ కోసం అవసరమైన అత్యాధునిక పరికరాలు, సాంకేతిక వినియోగం, ప్రస్తుత సదుపాయాల బలోపేతం వంటి అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బందితో చర్చించారు.ఆసుపత్రి భవనం పైభాగంలో నీటి లీకేజ్ సమస్యను గమనించిన కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను పిలిచి వెంటనే లీకేజీ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన ప్రసూతి విభాగం, శిశు సంరక్షణ విభాగం, అత్యవసర వైద్య విభాగం, వార్డులను సందర్శించి పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, రోగుల సేవా ప్రమాణాలను పరిశీలించారు. అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ —“ఆసుపత్రి ఆవరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. పరిశుభ్ర వాతావరణంలోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది,” అని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా యూనిఫార్మ్‌లు ధరించాలని, అవసరమైతే వారందరికీ యూనిఫార్మ్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బంది నర్సుల కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి (GGH) నుండి తాత్కాలికంగా నర్సులను నియమించడానికి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇటీవల సిఎంఆర్ (CMR) బృందం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అందిస్తున్న సేవలను ప్రశంసించిందని, ఈ విజయానికి కృషి చేసిన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందిని కలెక్టర్ అభినందించి సన్మానించారు.జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఆదర్శంగా నిలవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఆధునీకరణ దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య విభాగాధికారులు, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :