Tuesday, 28 July 2026 01:40:48 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పేద ప్రజలపై మైక్రో ఫైనాన్స్ ల వేధింపులు ఆపాలి,AITUC జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య

Date : 01 July 2025 01:56 PM Views : 734

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 1 (తెలుగు వెలుగు) : జూలూరుపాడు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ లపై చర్యలు తీసుకోవాలని, డబ్బులు కట్టమని ఇబ్బందులకు గురి చేస్తే గ్రామాల్లో అడ్డుకుంటామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య హెచ్చరించారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల రక్తం తాగుతున్నారని , కట్టకపోతే క్రిమినల్ కేసు లు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిరుపేదలను బెదిరిస్తున్నారని, వారిని గ్రామాల్లో రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు, 40 .సంవత్సరాలగా అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ ,మోడీ నిరంకుష విధానానికి వ్యతిరేకంగా జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కంచర్ల జములయ్య పిలుపునిచ్చారు. మంగళవారం జూలూరుపాడు లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడుతూ కార్మికులకు ఈరోజు హక్కులుగా ఏ చట్టాన్ని కూడా ఏ ప్రభుత్వము దయతోను, ఇష్టంతోనో చేయలేదన్నారు.ఆ చట్టాలన్నీ కార్మికులు తమ రక్తాన్ని చిందించి పోరాడి సాధించుకున్నవని వారు గుర్తు చేశారు. అటువంటి చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకురావాల్సిన అవసరమేంటన్నారు. నిజంగా మోడీకి కార్మికుల మీద అంత ప్రేమ ఉంటే, వారి సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉన్న కార్మిక చట్టాలను పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. కానీ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తొలగించి యాజమాన్యానికి అనుకూలంగా ఉండే లేబర్ కోడ్ లను తీసుకువచ్చి తన వక్ర బుద్ధి చూపించారన్నారు. 2014- 19, మరియు 2019 నుండి 24 మధ్యలో మోడీ ప్రభుత్వం సంఘటిత సంఘటితంగా కార్మికుల కొరకు ఖర్చు చేసిన మొత్తం లక్ష కోట్లు కూడా లేదన్నారు. పది సంవత్సరాల కాలంలో లక్ష కోట్లు కూడా లేవంటే సంవత్సరానికి కేవలం పది వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. కానీ ఇదే సందర్భంలో 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల శక్తులకు 16 లక్షల 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంపద సృష్టికర్తల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ లెక్కలే తెలియ చెబుతున్నాయన్నారు. ఎంపీల జీతాలు పెంచుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనం రోజుకు 375 రూపాయలకు దానిని 90 కుదిరించడం దారుణమైన విషయమన్నారు. నరేంద్ర మోడీ చెప్తున్నట్లుగా లేబర్ కోడులు అమల్లోకి వస్తే వారి జీవితం ఎట్టి పరిస్థితుల్లో బాగుపడదని, వాటి సారాంశాన్ని ఒకసారి పరిశీలిస్తే కార్మికులను ఏ విధంగా దోపిడీ చేయాలో, వారి బతుకులను రోడ్లమీదకు ఏ విధంగా తేవాలో స్పష్టంగా తెలియచెప్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికుల ఉపాధి కొరకు ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై కూడా మోడీ శీతకన్ను వేశాడన్నారు. . కార్మికుల హక్కుల సాధనకై జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి సంఘటిత అసంఘటిత రంగా కార్మికులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఏఐటీయూసీ నాయకులు గుడిమెట్ల సీతయ్య, ఎస్.కె చాంద్ పాషా, వల మల్ల సామేలు, నిమ్మటూరి లచ్చయ్య, పానుగంటి మహేష్, గార్లపాటి వీరభద్రం, బాపట్ల పూర్ణ చందర్రావు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :