Tuesday, 28 July 2026 09:38:33 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు: జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 29 June 2026 03:22 PM Views : 130

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ములకలపల్లిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ములకలపల్లి మండలంలో పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంతో పాటు ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీఎల్‌వోలకు సూచించారు. ఫారాల పంపిణీ సందర్భంగా ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లే సమయంలో ప్రతి కుటుంబాన్ని తప్పనిసరిగా కలుసుకుని అవసరమైన వివరాలను నమోదు చేయాలని, ఏ ఒక్క అర్హుడూ మిగిలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఓటరు జాబితా సవరణను పూర్తిస్థాయి పారదర్శకతతో, భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన ఫారాలను గడువులోపు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, రోగులకు అందిస్తున్న చికిత్స విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్‌పేషెంట్ వార్డు, ఔట్‌పేషెంట్ వార్డు, ప్రసూతి గది, రక్త పరీక్షల గది, ఫార్మసీ, ఔషధ నిల్వ కేంద్రం, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి రోజువారీగా వచ్చే ఔట్‌పేషెంట్ల సంఖ్య, చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్ల సంఖ్య, నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా, ఔషధ నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో పరిశీలించారు. అవసరమైన మందులు, పరీక్షా సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, పరీక్షా కిట్లు, వైద్య సామగ్రిని తగినంతగా నిల్వ ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, సురక్షితమైన తాగునీటి వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ స్వాతి బిందు, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ సాయి కళ్యాణ్, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీకృష్ణ, మెడికల్ సిబ్బంది ఇమ్రాన్, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :