Tuesday, 28 July 2026 12:40:22 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు.

Date : 24 February 2026 08:20 PM Views : 251

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు.ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఇంటర్‌మీడియట్ మరియు పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో మంగళవారం రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రానా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్ నుండి పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంటర్ మరియు పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీటీవీ పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని, చీఫ్ సూపరింటెండెంట్లు తమ బాధ్యతలను కచ్చితంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాల బయట విద్యార్థులు, సిబ్బంది సౌకర్యార్థం క్లాస్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి సెక్షన్ ను అమలు చేయాలని అన్నారు. పరీక్షావ కేంద్రాల వద్ద అవసరమైన కిట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, అవసరమైన ఫర్నిచర్ వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ పరీక్షలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, జిల్లాలో రేపటి నుండి నిర్వహించనున్న ఇంటర్‌మీడియట్ వార్షిక పబ్లిక్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 25, 2026 నుండి మార్చి 18, 2026 వరకు ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 18,685 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రశ్నాపత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా మరియు భద్రపరిచే ప్రక్రియలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కల్పించినట్లు తెలిపారు .మార్చి 14, 2026 నుండి ఏప్రిల్ 16, 2026 వరకు నిర్వహించనున్న పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సాధారణ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడనున్నాయని చెప్పారు. జిల్లాలో 12,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 404 మంది ప్రైవేట్ అభ్యర్థులు నమోదు కాగా, మొత్తం 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ఏర్పాటు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయం, తాగునీరు మరియు ఇతర మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విధుల్లో పాల్గొనే అధికారులు తప్పనిసరిగా తమ ఐడీ కార్డులు ధరించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు . సిబ్బందికి అవసరమైన శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కి ఫోన్ లు మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు తీసుకు వెళ్లకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సమన్వయంతో, విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, జిల్లా ఇంటర్మిడేట్ అధికారి వెంకటేశ్వర్లు ,వైద్య శాఖ అధికారి తుకారాం రాతోడ్,డి పి ఓ సుధీర్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత,రవాణా శాఖ అధికారి,టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనరాణి ,ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వర్లు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :