తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తుల్జా భవాని జాతర ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలని వినతి. హైదరాబాద్కు తరలివెళ్లిన ఉద్యోగ, ఉపాధ్యాయ, సాధులు, బంజార సంఘాల నాయకులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్, శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని జాతర ఏర్పాటుకు చేయుట గురించి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ అటవీ శాఖ బోర్డు సభ్యులు, వైరా నియోజకవర్గ శాసన సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్ నాయక్, వైస్ చైర్మన్ బానోత్ వీరు నాయక్ల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందచేశారు. జిల్లాకు చెందిన బంజారా ఉపాధ్యాయ, ఉద్యోగ, సాధులు, బంజారా సంఘాల నాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 50 మందికిపైగా హైదరాబాద్కు తరలి వెళ్లి రాందాస్నాయక్ను కలిశారు. ఈ సందర్భంగా బంజారా సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ శంకర్నాయక్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారాల ఆరాధ్య దైవాలకు సంబంధించి ఎటువంటి ఆలయాలు, జాతర స్థలాలు లేవని, దీనివల్ల ప్రతీ యేటా జాతరలు నిర్వహించేందుకు బంజారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బంజారాలు కీలకపాత్ర పోషించారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షలకు పైగా బంజారా జనాభా ఉన్నారని పేర్కొన్నారు. గతంలో జిల్లా కేంద్రంలోని రేగళ్ల ప్రాంతంలో కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆలయ నిర్మాణం జరగలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సంత్ శ్రీశ్రీశ్రీ సేవా లాల్ మహారాజ్, శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని ఆలయ నిర్మాణంతోపాటు జాతర నిర్వహణ కోసం అవసరమైన స్థలాన్ని అన్ని అనుమతులతో ప్రభుత్వం కేటాయించే విధంగా కృషి చేయడంతోపాటు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి త్వరితగతిన అన్ని అనుమతులతో స్థలం కేటాయించడంతోపాటు జాతర నిర్వహణకు అవసరమైన నిధులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జేఏసీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ను కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను విన్నవించారు. శ్రీశ్రీశ్రీ తుల్జా భవాని జాతర ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదంబసేన వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు, సాధుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూనావత్ శంకర్, బిచ్చ సాధు, వస్రాం సాధు, బంజారా భవన్ పాల్వంచ కమిటీ నాయకులు భూక్య చందు, బానోత్ రాము, జిల్లా జేఏసీ నాయకులు ధరావత్ కాన్షీరాం, బానోత్ రమేష్, డాక్టర్ వెంకట్, జాటోత్ భరత్, టిఎస్టిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు బి.మోహన్, సపావత్ బాలకృష్ణ, జర్పుల బిక్కులాల్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాళోత్ శివ నాయక్, ధరావత్ కృష్ణ, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ కేశవ్ నాయక్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గుగులోత్ మోహన్ నాయక్, చండ్రుగొండ మండల అధ్యక్షులు భూక్య రాందాస్ రాథోడ్, జిల్లా నాయకులు బానోత్ చందర్ నాయక్, ఏజెన్సీ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బానోత్ లాల్సింగ్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ భద్రు నాయక్, భారతీయ గోర్బంజారా ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడ గణేష్, గుగులోత్ కోటి, బానోత్ రాము, జర్నలిస్టు సంఘాల నాయకులు బానోత్ నాగేశ్వరరావు, బానోత్ రమేష్, బానోత్ రాందాస్, ధరావత్ వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు మూడ్ జయరాం నాయక్, బీజేపీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు మాళోత్ గాంధీనాయక్, సీపీఐ నాయకులు మాళోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ