Tuesday, 28 July 2026 08:06:17 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మన గ్రోమోర్ వారి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, మహిళలకు ముగ్గుల పోటీలు

Date : 10 January 2026 04:21 PM Views : 711

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 10 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామం నందు కోరమండల్ వారి మన గ్రోమోర్ ఆధ్వర్యంలో డీలర్ సాయి మహాలక్ష్మి ట్రేడర్స్ ప్రోప్రైటర్ కళ్యాణపు ప్రసాద్ ఉచిత కంటి పరీక్ష క్యాంప్ నిర్వహించారు. కాకర్ల గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నవారు ఈ ఉచిత కంటి పరీక్ష వైద్య శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి వైద్య నిపుణులు మందులతో పాటు కళ్ళ అద్దాలు అవసరం ఉన్నవారికి పది రోజుల్లో గ్రామపంచాయతీ వద్ద కళ్లద్దాలను ఉచితంగా ఇస్తామన్నారు. మన గ్రోమోర్ వారు ఇదే గ్రామంలో మహిళల కోసం ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులను వేశారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ ముగ్గులను ఎంపిక చేసి వారికి బహుమతులు ఇచ్చారు. వారిలో మొదటి బహుమతి పోలూరి స్రవంతి, డిన్నర్ సెట్, రెండవ బహుమతి పోలూరి మీనా, డిన్నర్ సెట్, మూడవ బహుమతి చల్లా రేణుక హాట్ బాక్స్ అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు ఒక బహుమతిని అందజేశారు. బహుమతుల ప్రధానం అనంతరం మన గ్రోమోర్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా రివిజినల్ మేనేజర్ సుమన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామానికి సంబంధించి పంటలలో దిగుబడులు పెంచే దానికి మన గ్రోమోర్ వారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం, భూ పరీక్షలు, ఎరువుల వాడకం అలానే గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న మౌలిక సదుపాయాల ఏర్పాటు కోరమండల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కాకర్ల గ్రామాన్ని ఎంచుకున్నామని,త్వరలోనే ఈ గ్రామానికి మంచినీళ్ల సదుపాయం కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కళ్యాణపు ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని మా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నందుకు కోరమండల్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బానోత్ బుల్లి, మాజీ ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్, పంచాయతీ సెక్రటరీ నాని బాబు, వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :