తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన సదస్సు ను విజయవంతం చేయండి - ఐ.ఎల్.పీ.ఏ జిల్లా కన్వీనర్ గోపికృష్ణ, సుంకర భానుప్రియ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల కోసం “ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన కార్యక్రమం వచ్చే నెల నవంబర్ 1న శనివారం ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం అడ్వకేట్స్ లైబ్రరీ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఐ.ఎల్.పీ.ఏ. జిల్లా కన్వీనర్ గోపికృష్ణ, మహిళా కన్వీనర్ సుంకర భానుప్రియ తెలిపారు. గురువారం న్యాయవాదుల లైబ్రరీ హాల్ లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జరగనున్న “నేటి న్యాయవ్యవస్థలో ఫోరెన్సిక్ - శాస్త్రీయ సాక్ష్యాలు అత్యంత కీలకమైనవని, న్యాయవాదులు ఈ రంగంలో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా న్యాయ సాధనలో మరింత సమర్థవంతంగా వ్యవహరించగలరని అన్నారు. సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డా. మోహన్ ఎర్రగోళ (Ph.D.), ఫౌండర్ - డైరెక్టర్ – ప్రోబ్ ల్యాబ్ ఫోరెన్సిక్, హైదరాబాద్, ప్రధాన వనరుల నిపుణుడిగా పాల్గొని ఆయా అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనలతో అవగాహన కల్పిస్తారని పాలీగ్రాఫిక్ & ఫింగర్ప్రింట్ టెస్టులు,నార్కో విశ్లేషణ,లై డిటెక్షన్,సంతకం పరీక్ష, డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ విధానాలు,శాస్త్రీయ విశ్లేషణ పద్ధతులు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా న్యాయమూర్తి పి.వసంత్, విశిష్ఠ అతిధిగా అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత హాజరుకానున్నారని వీరితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడపాల మహాలక్ష్మి, యెర్రా కామేష్, సాధిక్ పాషా, ఎర్రపాటి కృష్ణ, మారపాక రమేష్, దొడ్డా సామంత్, మేకల దేవేందర్, అడపాల పార్వతీ, పాల రాజశేఖర్, పగిడిపల్లి శ్రీకాంత్, వడ్లకొండ హరిప్రసాద్, లక్ష్మీ సరిత, ఇందిరా ప్రియదర్శిని, బేబీ షామిలి, దారావత్ రాధాకృష్ణ, ఎర్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ