Tuesday, 28 July 2026 09:36:21 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ర్యాలీ..

Date : 05 June 2025 03:01 PM Views : 466

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 న గ్రీన్ ర్యాలీని సింగరేణి మహిళా కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మరియు కొత్తగూడెం బస్టాండ్ మీదుగా ఐ.ఎం.ఏ హాల్ వరకు నిర్వహించినారు. ఈ యొక్క ర్యాలీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐఏఎస్ మరియు బి . రవీందర్, పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో క్యాప్స్ మరియు నారసంచులను విడుదల చేసి ర్యాలీలో పాల్గొన్న వారందరికీ పంచడంతోపాటు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ యొక్క ర్యాలీలో కేటీపీస్ మరియు సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర ఉమ్మడి జిల్లా పరిశ్రమల ప్రతినిధులు, సింగరేణి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా ప్రత్యేక ఉద్దేశ్యమైన "ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేద్దాం' అనే అంశంపై అవగాహన సదస్సు ను శ్రీ బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఐ.ఎం. ఏ హాల్ నందు నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ముందుగా పర్యావరణ ఇంజనీర్ బి. రవీందర్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చట్టాలు- జిల్లాలో వాటి అమలును, పరిశ్రమలు మరియు ప్రజలు వారి దైనందిన జీవితములో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యలు గురించి వివరించినారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి వాటి బదులుగా నారా లేదా గుడ్డ సంచులను వాడాలని కోరారు. డా. పావని, అధ్యాపకురాలు సింగరేణి స్కూల్, కొత్తగూడెం, ప్రభాకర రావు మరియు శ్రీనివాస బాబు, చీఫ్ ఇంజనీర్స్, కేటీపీఎస్ వారు మాట్లాడుతూ పర్యావరణహితమైన చర్యలను గురించి మరియు RRR (Reduce, Reuse, Recycle) ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్ నారసంచులను విడుదల చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పంపిణీ చేయడం జరిగినది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, కొత్తగూడెం వారి తరపున బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్, సి హెచ్. అజయ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :