తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 న గ్రీన్ ర్యాలీని సింగరేణి మహిళా కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ మరియు కొత్తగూడెం బస్టాండ్ మీదుగా ఐ.ఎం.ఏ హాల్ వరకు నిర్వహించినారు. ఈ యొక్క ర్యాలీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐఏఎస్ మరియు బి . రవీందర్, పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో క్యాప్స్ మరియు నారసంచులను విడుదల చేసి ర్యాలీలో పాల్గొన్న వారందరికీ పంచడంతోపాటు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ యొక్క ర్యాలీలో కేటీపీస్ మరియు సింగరేణి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర ఉమ్మడి జిల్లా పరిశ్రమల ప్రతినిధులు, సింగరేణి కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా ప్రత్యేక ఉద్దేశ్యమైన "ప్లాస్టిక్ కాలుష్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా అంతం చేద్దాం' అనే అంశంపై అవగాహన సదస్సు ను శ్రీ బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయము, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ఐ.ఎం. ఏ హాల్ నందు నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో ముందుగా పర్యావరణ ఇంజనీర్ బి. రవీందర్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్య నియంత్రణ చట్టాలు- జిల్లాలో వాటి అమలును, పరిశ్రమలు మరియు ప్రజలు వారి దైనందిన జీవితములో తీసుకోవలసిన పర్యావరణ హితమైన చర్యలు గురించి వివరించినారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి వాటి బదులుగా నారా లేదా గుడ్డ సంచులను వాడాలని కోరారు. డా. పావని, అధ్యాపకురాలు సింగరేణి స్కూల్, కొత్తగూడెం, ప్రభాకర రావు మరియు శ్రీనివాస బాబు, చీఫ్ ఇంజనీర్స్, కేటీపీఎస్ వారు మాట్లాడుతూ పర్యావరణహితమైన చర్యలను గురించి మరియు RRR (Reduce, Reuse, Recycle) ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్ నారసంచులను విడుదల చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పంపిణీ చేయడం జరిగినది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, కొత్తగూడెం వారి తరపున బి. రవీందర్, పర్యావరణ ఇంజనీర్, సి హెచ్. అజయ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ