Tuesday, 28 July 2026 09:24:11 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత – ఎఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్

Date : 05 June 2026 04:54 PM Views : 110

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి ప్రధాన కార్యాలయంలో కార్పొరేట్ పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయడంతో పాటు పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పర్యావరణ హిత సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ప్రత్యేక జూట్ బ్యాగులను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రసంగించిన వంగ వెంకట్ మాట్లాడుతూ, ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణ నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన బాధ్యతలలో ఒకటని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, నీటి వనరుల క్షీణత వంటి సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, నీటి వనరులను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సింగరేణి సంస్థ చేపడుతున్న హరిత కార్యక్రమాలు, విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం, కాలుష్య నియంత్రణ చర్యలు మరియు పర్యావరణహిత కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :