Tuesday, 28 July 2026 01:22:19 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సుజాతనగర్‌లో హోటళ్లు, స్వీట్ల దుకాణాలపై ఆహార భద్రత శాఖ ఆకస్మిక తనిఖీలు.

Date : 07 July 2026 08:15 PM Views : 251

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మూడు లీగల్, మూడు సర్వైలెన్స్ నమూనాల సేకరణ – రెండు ఇంప్రూవ్‌మెంట్ నోటీసుల జారీ .ఫిర్యాదుల మేరకు మంగళవారం సుజాతనగర్‌లోని పలు హోటళ్లు, స్వీట్ల తయారీ, విక్రయ దుకాణాల్లో ఆహార భద్రత అధికారి శరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా కొన్ని ఆహార వ్యాపార సంస్థలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్, లైసెన్సులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత నిర్వాహకులు వెంటనే రిజిస్ట్రేషన్, లైసెన్సులు పొందడంతో పాటు ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు మూడు లీగల్ నమూనాలు, మూడు సర్వైలెన్స్ నమూనాలను సేకరించి విశ్లేషణ నిమిత్తం రాష్ట్ర ఆహార పరీక్షా ప్రయోగశాలకు పంపించారు. అలాగే పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల్లో లోపాలు గుర్తించిన రెండు ఆహార వ్యాపార సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆహార భద్రత అధికారి శరత్ మాట్లాడుతూ, ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం ప్రతి ఆహార వ్యాపార సంస్థ బాధ్యత అని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సు కలిగి ఉండాలని, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.నిబంధనలు ఉల్లంఘించే ఆహార వ్యాపార సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో ఆహార భద్రత శాఖ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆహార భద్రత అధికారి శరత్ తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :