Tuesday, 28 July 2026 04:51:17 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అప్రమత్తతే ఆయుధం.. సైబర్ నేరాల బారినపడి మోసపోకుండా జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 21 January 2025 06:49 PM Views : 934

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపై అలర్ట్ గా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు,హెర్బల్,హెల్త్ కేర్, ఇతర గృహాపకరణాల మార్కెటింగ్ పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ గారు మంగళవారం రోజున ఒక ప్రకటనను విడుదల చేశారు.తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని మళ్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ (పిరమిడ్ మోసాలు) మళ్ళీ ప్రారంభమయ్యాయని అన్నారు.గొలుసుకట్టుగా అమాయకులను వల వేసి మోసం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ విధమైన మోసాలకు కొంతమంది వ్యక్తులు పాల్పడుతున్నారని,అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తరహా మోసాల బారిన పడకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. విలాసవంతమైన వస్తువులిస్తామని,ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని,విదేశీ యాత్రలకు పంపుతామని,రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి,ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి,వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్ లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారు.ఇలాంటి స్కీం లలో తొలుత చేరిన తక్కువ మందికి లాభాలు చూపించి, మిగిలిన అందరి సొమ్ము కొల్లగొడతారని తెలిపారు.ఇలాంటి నూతన స్కీం ల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చెయ్యరనే విషయాన్ని గ్రహించాలని తెలిపారు.మనల్ని నమ్మించి,మభ్యపెట్టి, వంచించి మన దగ్గరి,మన ద్వారా మరికొందరి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే మోసగాళ్ల పని అని తెలిపారు. కాబట్టి ఇలాంటి నేరాల పట్ల మొబైల్ ఫోన్లను చూసే మనకు Facebook,వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ-మెయిల్, ఫోన్ కాల్ ల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఇటువంటి కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగవద్దని తెలుప్పారు.తొందరపడి బాధలను,నష్టాలను కొని తెచ్చుకోవద్దన్నారు.ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి గానీ, www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో నైనా వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చెయ్యాలని సూచించారు.సైబర్ మోసాల బారిన పడిన బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేయగలిగితే అంత త్వరగా వారు కోల్పోయిన నగదును తిరిగి పొందవచ్చని తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :