Tuesday, 28 July 2026 02:25:20 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వేణుగోపాల్.

Date : 30 May 2026 07:45 PM Views : 106

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 5 నుండి 12, 2026 వరకు నిర్వహించనున్న పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.శనివారం ఐ డి ఓ సి కార్యాలయం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 5వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,399 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని, వారి కోసం నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.పరీక్షల నిర్వహణ కోసం నాలుగు మంది చీఫ్ సూపరింటెండెంట్లు, నాలుగు మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు .విద్యార్థులు పరీక్షలకు ముందురోజే తమ పరీక్షా కేంద్రాలను తెలుసుకోవాలని , పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.పరీక్షల నిర్వహణలో విద్యుత్ సరఫరా, రవాణా, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సదుపాయాల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి, వైద్యశాఖ ప్రతినిధి డా. టి. ప్రతాప్, విద్యుత్ శాఖ డీఈ పి.ఎస్.వి.ఎస్. నందయ్య, ఇల్లందు మున్సిపాలిటీ ప్రతినిధి డి. శ్రీనివాస్, ఆర్టీసీ ప్రతినిధి కె. మోహన్‌రావు, డీపీఓ కార్యాలయ ప్రతినిధి ఎస్. శ్రీనివాస్, పోస్టల్ శాఖ ప్రతినిధి ఎం.డి. అలీం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి ఎం. అశోక్, పోలీసు శాఖ ప్రతినిధి పి.డి. క్రిస్టఫర్, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శంభు ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ (పరీక్షలు) ఎస్. మాధవరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :