తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సూపర్ బజార్ పునర్నిర్మాణం చేపట్టాలి. ఖాళీ చేస్తున్న క్వార్టర్లు కూలగొట్టకుండా చూడాలి.జిఎం కి వినతి పత్రం అందిస్తున్న 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్ లోని మార్కెట్ ఏరియాలో గల పాత సూపర్ మార్కెట్ ఏరియాలో నూతన బిల్డింగ్ నిర్మాణం చేసి రామవరం ప్రాంత అభివృద్ధికి సహకరించాలని రుద్రంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ షాలెం రాజు కి 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి పత్రాన్ని అందించారు. అనంతరం జిఎంకు వివరిస్తూ రామవరం ప్రాంతం గతంలో సింగరేణి కార్మికులతో కలకలాడుతుండే దని ఆనాటి వైభవం నేడు లేదని అన్నారు.,మరల పూర్వ వైభవం కోసం మార్కెట్ ఏరియాలో గల పాత సూపర్ మార్కెట్ లో నూతన భవనం నిర్మాణం చేపట్టి దానిలో సూపర్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. తద్వారా దాని చుట్టూ ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు, పూలు ఇతర షాపులు నడుపుకునే వారికి జీవనోపాధికి ఉపయోగపడేటట్లుగా నిర్మాణం చేయడం ద్వారా చాలామందికి ఉపాధి మార్గాలు దొరుకుతాయని ఆమె వివరించారు. దీనిపై స్పందించిన జిఎం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు గారు ఇచ్చిన వినతి ప్రకారం కొత్తగూడెం, రామవరం సింగరేణి సూపర్ బజార్ల నిర్మాణం ఫైల్ అండర్ ప్రాసెస్ లో ఉందని జిఎం అన్నారని ఆమె తెలిపారు.అలాగే కార్మికులు ఖాళీ చేసిన క్వార్టర్లను కూ లగొట్టడం ద్వారా ఆసాంఘిక, క్రిమి కీటకాలకు నిలయంగా మారుతున్నాయని జిఎం దృష్టికి తీసుకెళ్లారు. క్వార్టర్లను కూలగొట్టే విధానాన్ని ఆపాలని, పేదవారికి ఉపయోగపడే విధంగా చూడాలని వినతి పత్రంలో కోరారు. అలాగే మహిళా సంఘాల స్వయం ఉపాధి శిక్షణ కు, వారి సమావేశాలకు ఉపయోగపడే విధంగా ఒక కాలి క్వార్టర్ను కేటాయించాలని జి యం దృష్టికి మునిగడప పద్మ తీసుకెళ్లారు. అలాగే అంబేద్కర్ చమన్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి రామవరం ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉండేటట్లు సహకరించాలని జిఎం కి వివరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో న్యాయవాది, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఉన్నం దాస్ గడ్డ శాఖ టు కార్యదర్శి ఎస్కే జలీల్ తదితరులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ