తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ పాల్గొని స్వచ్ఛత కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా కౌన్సిలర్లను, మున్సిపల్ మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘనంగా సన్మానించారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ వారి సేవలను ఎమ్మెల్యే అభినందించారు. మహిళలకు సమాజంలో మరింత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, యువతతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మున్సిపాలిటీ కార్యాలయం నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా స్థానిక కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కౌన్సిలర్లు, డేరంగుల ప్రసాద్, దగ్గుమల్లి మౌనిక, చిన్నంశెట్టి శ్రీను, కట్ట సింధుజ, కొట్టే నాగ సునీత, షేక్ రహీన, కారం కనకదుర్గ, మిండా హరిబాబు, నార్లపాటి మహేష్ బాబు, పట్టం రమ్య, మోర్ల రాజేశ్వరి, దండ బత్తుల ఆదిలక్ష్మి, తిరుమల శెట్టి వెంకన్న బాబు, షేక్ నూర్జహాన్, నార్లపాటి దివాకర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ