Tuesday, 28 July 2026 02:25:18 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 06 November 2024 06:33 PM Views : 576

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే లో భాగంగా జిల్లాలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్యునరేటర్ సేకరిస్తున్న వివరాలను పరిశీలించారు, అనంతరం సర్వే చేసిన ఇంటికి స్టికర్ ను అంటించారు. అనంతరం సర్వేలో తీసుకోవలసిన జాగ్రత్తలు చేపట్టవలసిన చర్యలపై ఎమ్యునరేటర్ కు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైందని అన్నారు. జిల్లాలో మొత్తం 2761 ఏమ్యూనరేషన్ బ్లాక్ లు ఉన్నాయని, అన్ని బ్లాక్ లకు అమ్యూనరైటర్లను నియమించామన్నారు. ఒక్కో ఇమ్యునరేటర్ కి 150 గృహాలను కేటాయించామన్నారు. రానున్న మూడు రోజులు ఇంటి గుర్తింపు కార్యక్రమం చేపడతామని, గుర్తింపు చేసిన గృహాలకు స్టిక్కర్లు అందించడం జరుగుతుందని తెలిపారు. సర్వేలో భాగంగా ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని దాని ద్వారా రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కొరకై వివిధ సామాజిక,ఆర్థిక విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేయడం మరియు వాటిని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఎమ్యునరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎంతమంది ఉంటారు,వారి యొక్క ఆదాయ వివరాలు,ఎవరైనా విదేశాలలో ఉన్నారా, ప్రజా ప్రతినిధులుగా ఎవరైనా ఉన్నారా, వారి యొక్క ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు వంటి 75 ప్రశ్నలకు వివరాలు సేకరిస్తున్నారన్నారు.ప్రజలు అందరూ ఇంటింటి సర్వేలో పాల్గొనాలని సూచించారు. సర్వేలో భాగంగా ఫారం నింపే సమయంలో ప్రజలు ఆధార్ కార్డు,రేషన్ కార్డ్ వంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి మరియు సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :