తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం( తెలుగు వెలుగు ) : జూలూరుపాడు ప్రధాన రహదారి చండ్రుగుండ రహదారి కూడలి నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై జీనత్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలలో ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ధృవపత్రాలు, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వాహన నెంబర్ ప్లేట్లు ను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని, సరైన పత్రాలు లేకుండా, నంబర్ ప్లేట్లు లేకుండా, లేదా మైనర్లు వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సై మనీషా, ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వరరావు, బ్లూ కోర్టు వెంకట్, కానిస్టేబుల్లు కోటి, గంగరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ