తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొత్తగూడెం వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన అవతరణ వేడుకకు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామవరం కేంద్రంలో జాతీయ పతాకం, బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో కాపు కృష్ణ టీబీజీకేఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ, కూసాన వీరభద్రం సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ, గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్, తుమ్మ శ్రీనివాస్ కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్, జాఫర్ హుస్సేన్ ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్, అశోక్ బ్రాంచ్ సెక్రటరీ, శివకుమార్ బ్రాంచ్ సెక్రటరీ, అశోక్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ కుమార్, స్వామి, యూసుఫ్, తొగర రాజశేఖర్ , సూరిబాబు, అన్వర్ కాజా, కాజా భక్ష, మధుసూదన్ రావు,పూర్ణచంద్రరావు, సురేష్ అశోక్, బషీర్, రామ్ కుమార్, సురేందర్, దేవదానం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ