Tuesday, 28 July 2026 06:15:01 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి - క్యాన్సర్ బారిన పడకండి : LT & Pharmacist సమీక్షా సమావేశంలో డాక్టర్ తుకారం రాథోడ్ DMHO

Date : 13 April 2026 05:39 PM Views : 181

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి Dr తుకారాం రాథోడ్ , LT ఫార్మసీ ఆఫీసర్, నెలవారి సమీక్ష సమావేశంలో భాగంగా ఆలోచన మీటింగ్ హాల్ నందు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం మన జీవితంలో భాగమైపోయిందని దాని వలన అనేక అనర్ధాలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ముఖ్యంగా అనేకమంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలియజేశారు, ఆరపదార్ధాలు త్రాగునీరు వంటి వాటికి ప్లాస్టిక్ వాడకాన్ని ఉపయోగించకూడదని, మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ ని దూరం పెట్టాలని, బయట ఆహార పదార్థాలను తినకూడదని , నూనెలు రీసైక్లింగ్ చేసి వాడుతున్నందువలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు, ప్రతిరోజు 5 లీటర్ల నీరు త్రాగాలని అలాగే శారీరక శ్రమ ఎక్సర్సైజులు , నడక మరియు యోగా చేయాలని తెలియజేశారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లా ఏజెన్సీ జిల్లా అయినందువలన మన దగ్గరికి వచ్చే పేద రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని వారికి అవసరమైన మందులు ఇవ్వాలని , రక్తపరీక్షలు నిర్వహించాలని తెలియజేశారు ఉద్యోగులు అందరూ సమయపాలన పాటించాలని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డ్యూటీలో ఉండాలని విధులలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించనని తెలియజేశారు , క్యాన్సర్ నివారణకు వేసే HPV వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అర్హులైన యుక్త వయసు బాలికలకు అందరకు HPV వ్యాక్సిన్ వేయించేలాగా ప్రోత్సహించాలని తెలియజేశారు. భద్రాద్రి జిల్లా లో ఆరోగ్య సూచికలలో ముందు ఉంచాలని అందుకు మీరందరూ బాధ్యతగా పనిచేయాలని ఆరోగ్య సిబ్బంది ఆసుపత్రికి వచ్చే ప్రజలతో సత్ప్రవర్తనతో అభిమానంగా పలకరించాలని, ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించని, జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానలు , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందీర్ లలో ఆకస్మికతని తనికి చేస్తానని సిబ్బంది ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయపాలన పాటించకపోయినా శాఖ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు పాముకాటు , కుక్కకాటు మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. ఎండాకాలం దృశ్య వడ దెబ్బ తగలకుండా ప్రజలకు ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. సికిల్ సెల్ , తల సేమియా, HIV, వ్యాధిల పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. TB అనుమానిత వ్యక్తుల నుండి స్పుటం శాంపిల్ సేకరించాలని , BP, సుగర్ మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. IHIP పోర్టల్ లో ప్రగతి నివేదికలు ప్రతిరోజు ఆన్లైన్ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో , Dr సాయి కల్యాణ్ Dy DMHO కొత్తగూడెం, Dr రాందాస్ PO మలేరియా గారు, సొమ్లా CHO , రాంప్రసాద్ HEO, కుమార స్వామి AMO ,ఎల్టీలు మరియు ఫార్మసీ ఆఫీసర్స్ పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :