తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సర్వారం గ్రామపంచాయతీ లోని రామాలయం సెంటర్ నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జీవనజ్యోతి, జీవన బీమా, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ఎస్బిఐ RBO, Fi మేనేజర్ భాను పద్మశ్రీ , సింగభూపాలెం బ్రాంచ్ మేనేజర్ బాలగోపాల్ ఆధ్వర్యంలో పథకంపై అవగాహన కల్పిస్తూ వారికి ఇన్సూరెన్స్ ఆన్లైన్ చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుజాతనగర్ మండల మాజీ బిజెపి అధ్యక్షులు భూక్య రాజేష్ నాయక్ పాల్గొని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారీ ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తూ వారి కుటుంబ సంక్షేమం కోసం, వారి ఆర్థిక పురోగతి కోసం పాటుపడుతుందని మేడి ఈన్ ఇండియా, మెకిన్ ఇండియా ద్వారా డిజిటల్ ఇండియాగా అభివృధి చెందిందని తెలియజేసారు. నేటి సమాజంలో బ్యాంకింగ్ వ్యవస్థ పేద ప్రజలకు సైతం మరింత చేరువందని బ్యాంకింగ్ ఒక్క విశిష్టతలను మరియు సైబర్ నేరాల నుంచి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సతీష్ గారు, రైతులు, మహిళలు, యువకులు, గ్రామపంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ