Tuesday, 28 July 2026 11:17:23 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆశా డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన డాక్టర్ తుకారాం రాథోడ్

Date : 03 February 2026 06:21 PM Views : 131

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లాలోని జగన్నాధపురం, ఎంపీ బంజర మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశా డే సందర్భంగా తనిఖీ చేయడం జరిగినది . జగన్నాధపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గ్రామ ప్రజలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బిల్డింగ్ శాశ్వత నిర్మాణం గురించి మాట్లాడడం జరిగినది.ఆషాడే సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీ స్త్రీల రిజిస్ట్రేషన్ నమోదు మరియు ప్రభుత్వఆసుపత్రి లో కాన్పులు జరిపించాలని, సిజేరియన్లకు తావివ్వకూడాదు. గర్భిణీలను నమోదు చేసినప్పటి నుంచి కాన్పు అయ్యేంతవరకు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి ,ప్రత్యేకంగా గుత్తి కోయ హ్యాబిటేషన్లలో ఈ కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టాలి .రికార్డులు సక్రమంగా నిర్వహించాలి . ఎం సి హెచ్ కార్డులు అర్హులందరికీ అందజేయాలని రక్తహీనత రాకుండా వారికి ఐరన్ మాత్రలు ఎప్పటికప్పుడు ఇస్తూ అవసరమైన వారిని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లి వారికి రక్తం ఎక్కించాలని తెలియజేశారు అదే విధంగా గర్భిణీ స్త్రీలకు తల్లులకు విహెచ్ఎన్ డి నిర్వహించినప్పుడు వారికి తల్లిపాల ప్రాముఖ్యత మరియు వ్యాధి నిరోధక టీకాలు వ్యక్తిగత శుభ్రత చేతుల శుభ్రత గురించి కుటుంబ నియంత్రణ గురించి కచ్చితంగా తెలియజేయాలని సూచించారు జిల్లాలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతున్న లెప్రసీ నిర్మూలన కార్యక్రమంలో విజయవంతం చేయాలని మరియు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంను కూడాపటిష్టంగా నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకూడదని కాలేజీలలో మరియు పాఠశాలలలో సమావేశాలను నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని , ఆశలకు మరియు ఏఎన్ఎం లకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆశాడే నందు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సూపర్వైజర్లు ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :