తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ది:22-09-2025 తేదీన రాత్రి 9 గంటల సమయంలో గణేష్ బస్తి ఏరియాలో జరిగిన దారుణ హత్యకు కారకులైన ఇద్దరు నిందితులను కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ వివరాలను వెల్లడించారు. 22-09-2025 రోజు రాత్రి 9 గంటల సమయంలో గుబ్బల రాంమోహన్ రావు, 58 సం తన యొక్క ఇంటి నందు భోజనం చేయుచుండగా,ఇద్దరు వ్యక్తులు మారణాయుధాలతో ఇంటిలోకి ప్రవేశించి రాంమోహన్ రావుని చేతులతో కొట్టుచుండగా భయంతో అతను ఇంటిలో నుండి బయటకు ఎవరైనా కాపాడుతారనే ఉద్దేశంతో బయటకు వచ్చినాడు. కానీ అతడిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో వారి వెంట తెచ్చుకున్న పొడవైన పిడి గల ఒక సుత్తితో అతని తల పైన కొట్టగా అక్కడికక్కడే చనిపోయినాడు. పట్టుబడిన నిందితుల వివరాలు. A-1) Mohammad Shaheer @ Shaher s/o Shakir late, 26yrs, Muslim, Mutton shop, R/o Ramavaram, Chunchupalli . A-2) Vasampelli Vamshi s/o Ramaswamy, 30yrs, SC-Madiga, R/o Venugopal temple area, Ramavaramహత్యకు గల కారణాలు, మృతుడు వృత్తి రీత్యా రిటైర్డ్ SCCL ఉద్యోగి అతనికి 2019 లో రామవరంకి చెందిన చలపతితో స్నేహం ఏర్పడినది.ఆ స్నేహం కారణంగా మృతుడు తరుచూ చలపతి ఇంటికి వెళ్ళేవాడు.ఆ క్రమంలో మృతుడికి చలపతి భార్య సత్యవతి మీద కన్నుపడి బలవంతంగా లొంగదీసుకొని అక్రమ సంభందం పెట్టుకోవడంతో,అదే సమయంలో ఆమెకు A1 అయిన మొహమ్మద్ షాహిర్ తో అక్రమ సంబందం ఏర్పడి ఆమె తన భాధను చెప్పగా A-1 తన చిన్ననాటి స్నేహితుడయిన A2 వాసంపల్లి వంశీతో చెప్పి ,ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం మృతుని ఇంటికి వెళ్ళి అతి కిరాతకంగా తలపై సుత్తితో కొట్టి చంపినారు.
Admin
తెలుగు వెలుగు టీవీ