Tuesday, 28 July 2026 12:08:06 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆరవ రోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు

Date : 27 September 2025 10:29 AM Views : 301

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దసరా సంబరాల్లో భాగంగా ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ వేడుకలను ఐడిఓసి కార్యాలయంలో జిల్లా పరిషత్, జిల్లా సహకార శాఖ మరియు ఏడి మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం పూలతో, రంగవల్లులతో కళకళలాడింది. సాంప్రదాయ వాతావరణంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మలను అలంకరించి సమిష్టిగా పూజలు నిర్వహించారు.ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి హాజరై బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందంగా ఆడిపాడారు. పండుగ సందర్భంగా మహిళా శక్తి, తెలంగాణ సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యత ప్రతిబింబించేలా కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఆడబిడ్డల గౌరవానికి ప్రతీక. పూలతో సృష్టించిన ఈ సాంప్రదాయ బతుకమ్మ మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఉద్యోగిణులు, సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొని పండుగను ఘనంగా జరుపుకోవడం అభినందనీయం అని అన్నారు.జడ్పీ సీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ... “బతుకమ్మ పండుగలో సాంస్కృతిక, సామాజిక ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరహా వేడుకలు ఉద్యోగులు, అధికారులు మధ్య అనుబంధాన్ని పెంచుతాయి. పూలతో చేసిన ఈ బతుకమ్మలో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ఉన్న ప్రాధాన్యత కూడా మనకు గుర్తు చేస్తుంది అని పేర్కొన్నారు.కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బతుకమ్మలతో పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. ఈ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లేనినా, డిసిఒ రుక్మిణి, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, టీజీవోస్ జిల్లా అధ్యక్షులు వెంకట పుల్లయ్య, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :