Tuesday, 28 July 2026 02:32:50 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Date : 15 August 2025 06:13 PM Views : 688

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ జెండాను ఆవిష్కరించి,జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 08.30 గంటలకు జిల్లా ఎస్పీ కార్యాలయం నందు జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఐపిఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి,అధికారులు సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకు సమకూర్చిపెట్టిన ఈ స్వాతంత్ర్య భారతదేశం నేటితో 78 వసంతాలను పూర్తి చేసుకుందని,ఈ సందర్భంగా ఆ మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం వంటి జాతీయ పండుగలు సమాజానికి మన వంతు సేవలను ఏ విధంగా అందజేయాలో గుర్తు చేస్తాయని అన్నారు.పోలీస్ అధికారులు,సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని,పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతిఒక్కరిని సమానంగా చూడటం,ప్రతి బాధితుడికి న్యాయం చేయగలిగినప్పుడే మనం సాధించుకున్న స్వాతంత్ర్య దేశానికి సార్థకత అని అన్నారు.భిన్న భాషలు,భిన్న జాతులు,భిన్న మతాల కలయిక మన భారత దేశం అని,ఇన్ని విభిన్న సంస్కృతి,సాంప్రధాయలున్న వ్యక్తులు లేదా సమూహాల మధ్య సామరస్యం మరియు ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని,భారతీయులుగా పుట్టినందుకు మనందరం గర్వపడాలన్నారు.ప్రతిఒక్కరూ తమ పనిని మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్లాలని,ప్రజలు పోలీస్ శాఖ నుండి ఆశిస్తున్న అంచనాలను అందుకోవాలని,మన విధులను అంకితభావంతో నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్లు సీ.హెచ్ శ్రీనివాస్,ఇ.శ్రీనివాస్ డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,కార్యాలయ ఏఓ మంజ్యా నాయక్ మరియు సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :