తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : :రామవరంలోని ఐదు మసీదుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఫహీమ్ దాదా గారిని ఖబిరిస్తాన్ మరియు ఈద్గా అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగింది, ఈ సందర్భంగా మస్జిద్ ఎ రహీం ఖురేషి మస్జీద్ కమిటీ మరియు పెద్దల అధ్వర్యంలో ఫహీమ్ దాదా గారిని శాలువాతో పూలమాల వేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మస్జీద్ కమిటీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పటి నుండి విద్యార్థి ఉద్యమాల్లో చూరికైనా పాత్ర వహించాడని, కుల మతాలకు అతీతంగా రామవరం ప్రజలకు సేవలందిస్తూ వారి గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాడని, ఇప్పుడు కబరిస్తాన్ మరియు ఈద్గా అధ్యక్షులుగా ఐదు మసీదుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరంగా ఉందని వారు అన్నారు ,అనంతరం ఫహీమ్ దాదా మాట్లాడుతూ మా కమిటీ ఆధ్వర్యంలో పేద కుటుంబంలో ఎవరి చావైన జరుగుతే మేము పూర్తి ఖర్చు భరించి వారికి అండగా నిలబడతామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి సహకారంతో కబరిస్తాన్ మరియు ఈద్గా అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన అన్నారు నన్ను రామవరం ఈద్గా మరియు కబరిస్తాన్ అధ్యక్షులుగా ఎన్నుకున్న ముస్లిం పెద్దలకు ఐదు మజీదుల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం రామవరం మైనారిటీ నాయకులు మజీద్ కమిటీ సభ్యులు ఖయ్యుమ్, జలీల్, అజీజ్, జానీ, రసూల్,హనీఫ్, బాషా,యూసుఫ్,యాకుబ్, లతీఫ్,ఆఫ్జాల్,హమ్మద్,షఫీ, జమీల్,జహీద్,హబీబ్,రహీం, చందు,షాకీర్, అనీజ్,అక్రమ్,తదితరులు పాలుగొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ