Tuesday, 28 July 2026 12:16:22 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పాల్వంచ పట్టణంలో నిర్వహించిన “99 డేస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో పాల్గొన్న (DM&HO) డా. తుకారం రాథోడ్

Date : 03 April 2026 10:21 AM Views : 186

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ పాల్వంచ పట్టణంలోని పాత ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “99 డేస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి డా. తుకారం రాథోడ్ ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించడం అవసరమని తెలిపారు. అలాగే కాలానుగుణంగా వచ్చే జ్వరాలు, సంక్రమణ వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ, శుభ్రమైన తాగునీటి వినియోగం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డా. టి. ప్రతాప్ , ప్రోగ్రాం ఆఫీసర్ (CHI), డా. దేవేందర్ రాజ్‌పుత్, మెడికల్ ఆఫీసర్, పీహెచ్‌సీ ఉల్వనూరు మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రామ సభ కార్యక్రమం ప్రజల సక్రియ భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య సందేశాలు చేరవేయబడినవి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :