తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డా. తుకారం రాథోడ్ పాల్వంచ పట్టణంలోని పాత ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “99 డేస్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం కింద గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి డా. తుకారం రాథోడ్ ప్రజారోగ్యంపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను కచ్చితంగా పాటించడం అవసరమని తెలిపారు. అలాగే కాలానుగుణంగా వచ్చే జ్వరాలు, సంక్రమణ వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ, శుభ్రమైన తాగునీటి వినియోగం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డా. టి. ప్రతాప్ , ప్రోగ్రాం ఆఫీసర్ (CHI), డా. దేవేందర్ రాజ్పుత్, మెడికల్ ఆఫీసర్, పీహెచ్సీ ఉల్వనూరు మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రామ సభ కార్యక్రమం ప్రజల సక్రియ భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య సందేశాలు చేరవేయబడినవి.
Admin
తెలుగు వెలుగు టీవీ