Tuesday, 28 July 2026 03:18:43 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రైతులకు స్థిర ఆదాయానికి సమీకృత వ్యవసాయం ఉత్తమ మార్గం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 02 February 2026 07:59 PM Views : 204

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం సాధించేందుకు సమీకృత వ్యవసాయ విధానం ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామంలో రైతు పడిగా ప్రశాంత్ ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అమలు చేస్తున్న సమీకృత, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆయన పరిశీలించారు.ఈ సమీకృత వ్యవసాయ కేంద్రంలో ఆకుకూరలు, మునగతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ విధానంలో సాగు చేస్తున్న తీరును కలెక్టర్ ప్రశంసించారు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నందుకు రైతు పడిగా ప్రశాంత్‌ను అభినందించారు. అలాగే యూనిట్‌లో కొనసాగుతున్న కొర్రమీను చేపల పెంపకం, మేకల పెంపకం, బ్యాక్‌యార్డ్ మదర్ యూనిట్, డక్స్ యూనిట్‌లను కూడా పరిశీలించి, వాటి నిర్వహణపై రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ తరహా సమీకృత వ్యవసాయ యూనిట్లు జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ అన్నారు.అనంతరం మైలవరం గ్రామంలో రైతు మాడె కృష్ణవేణి ఏర్పాటు చేసిన కౌజు పిట్టల యూనిట్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ యూనిట్‌ను కేవలం రూ.25,000/- తక్కువ పెట్టుబడితో షెడ్ నిర్మాణం, ఫెన్సింగ్, కౌజు పిల్లలు, ఫీడ్ మరియు అవసరమైన పరికరాలతో ఏర్పాటు చేసిన విధానాన్ని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తక్కువ పెట్టుబడితో గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ యూనిట్లను జిల్లాలో విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని , జిల్లాలో ఈ విధంగా 500 కౌజు పిట్టల యూనిట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే మైలవరo గ్రామానికి చెందిన యువ రైతు కుంజా సందీప్ అమలు చేస్తున్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. అనేక రకాల సమీకృత పంటల సాగుతో పాటు జీవామృతం, పంచగవ్య వంటి సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్లను పరిశీలించి, సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరిగి, సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు దీర్ఘకాలిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా యువ రైతు కుంజా సందీప్‌ను కలెక్టర్ అభినందిస్తూ, సేంద్రియ సాగును మరింత విస్తృతంగా చేపట్టాలని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ గ్రామంలోని యువ రైతులకు సమీకృత వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు సుజాతనగర్‌లోని రవి హైబ్రిడ్ సీడ్స్ కేంద్రాన్ని సందర్శించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ, సమీకృత వ్యవసాయ విధానం రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయాన్ని అందించే ఉత్తమ మార్గమని తెలిపారు. ఒకే వ్యవసాయ క్షేత్రంలో పంటల సాగుతో పాటు పశుపోషణ, పక్షుల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలను సమన్వయంతో చేపట్టడం వల్ల సాగులోని ప్రమాదాలు తగ్గి లాభాలు పెరుగుతాయని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక సాగునీటి పద్ధతుల వినియోగంతో నీటి వృథా తగ్గి దిగుబడులు మెరుగుపడతాయని అన్నారు. తక్కువ పెట్టుబడితో కౌజు పిట్టల యూనిట్లు, బ్యాక్‌యార్డ్ యూనిట్లు, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు గ్రామీణ యువత, మహిళలకు మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. జిల్లాలో ఈ తరహా మోడల్ యూనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకయ్య,సంబంధిత శాఖల అధికారులు, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :