Tuesday, 28 July 2026 02:37:14 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధుల శిక్షణను విజయవంతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు .

Date : 10 March 2026 08:40 PM Views : 344

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమావేశమై ఈ నెల 12వ తేదీన ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడిందని తెలిపారు. ఈ కార్యాచరణను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, అరైవ్ అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, మహిళలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం జరుగుతుందని వివరించారుఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు జిల్లా కేంద్రాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో ప్రజా ప్రతినిధులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, పాత్రపై అవగాహన కల్పించాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలపై కూడా వారికి స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలపై కూడా ప్రజా ప్రతినిధులకు సంక్షిప్తంగా వివరించాలని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్ల సహాయంతో సులభంగా అర్థమయ్యే విధంగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలు, పట్టణ ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ–ఆఫీస్ విధానంలో పెండింగ్ ఫైళ్లను వేగవంతంగా క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను దశల వారీగా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిపిఓ సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :