తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 24 ( తెలుగు వెలుగు ) : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని సీనియర్ బాక్సర్,జిల్లా బాక్సింగ్ ప్యాట్రాన్ యెర్రా కామేష్ అన్నారు.మంచిర్యాలలో శనివారం నుండి ప్రారంభమైన టైసన్ కప్ ఓపెన్ స్టేట్ బాక్సింగ్ పోటీలలో భాగంగా బౌట్ పోటీలను ప్రారంభించారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతీ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని,ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుటకు కృషి చేయాలన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.ప్రస్తుత తరుణంలో బాక్సింగ్ పోటీలను నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు.బాక్సింగ్ పోటీలు విజయవంతం కావాలని ఆకాక్షించారు. ఈకార్యక్రమంలో తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి,సర్వేశ్, వినయ్,బాబీ,సోనూ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ